ప్లీజ్... మా పరువు తీయకండి... పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్

ఠాగూర్
ఆదివారం, 12 అక్టోబరు 2025 (11:57 IST)
పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. అబద్ధపు ప్రచారాలతో మీ పరువుతోపాటు మా పరువు తీయొద్దంటూ హితవు పలికింది. పదేపదే తప్పుడు ప్రచారాలు చేస్తూ పరువు తీసుకోవద్దని కోరింది. 
 
ఇలా హితబోధ చేయడానికి కారణం లేకపోలేదు. అగ్రరాజ్యం అమెరికా నుంచి అత్యాధునిక మిస్సైల్స్ ఏఐఎం-120 తమకు అందజేస్తోందంటూ ప్రచారం చేసింది. వీటిని నిజమని నమ్మిన పాకిస్థాన్ మీడియా పలు రకాలైన వార్తా కథనాలను వండివార్చింది. ఈ విషయం అమెరికా రక్షణ శాఖ చెవిన పడింది. దీంతో వివరణ ఇచ్చింది.
 
పాకిస్థాన్‌కు కొత్తగా ఎలాంటి మిసైల్స్ ఇవ్వడంలేదని పేర్కొంది. 2007లో 700 ఎఫ్-16 యుద్ధ విమానాల అమ్మకం సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు విడి భాగాలను సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే అందజేసిన ఎఫ్-16 విమానాలకు సంబంధించిన సాంకేతిక సపోర్ట్, విడి భాగాలను మాత్రమే పంపిస్తున్నట్లు తెలిపింది. 
 
ఈ అంశాలను తప్పుగా అర్థం చేసుకున్న పాక్ మీడియా అవాస్తవమైన సమాచారం, అంశాలతో కథనాలు ప్రచురించిందని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం వివరణ ఇచ్చింది. గతంలోనూ పాకిస్తాన్ అనేక అంశాలపై తప్పుడు ప్రచార చేసి నవ్వులపాలైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments