Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టుల పట్ల క్రూరంగా ప్రవర్తించిన తాలిబన్లు.. గదిలో బంధించి.. అండర్ వేర్‌తో..?

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (13:00 IST)
Journalist
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు జర్నలిస్టుల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. వెస్ట్రన్ కాబూల్‌లోని కార్ట్ ఈ చార్ ఏరియాలో మహిళల నిరసన ప్రదర్శనను కవర్ చేస్తున్న జర్నలిస్టులను తాలిబన్లు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు జర్నలిస్టులను తాలిబన్లు అపహరించి, ఓ గదిలో బంధించారు. అక్కడ వారి బట్టలు విప్పి.. దారుణంగా కొట్టారు. జర్నలిస్టుల శరీరమంతా రక్తపు మరకలే.
 
కేవలం వారి శరీరంపై అండర్‌వేర్ మాత్రమే ఉంది. ఆ ఇద్దరు జర్నలిస్టులను హింసిస్తూ, ఎగతాళి చేశారు తాలిబన్లు. తామిద్దరం జర్నలిస్టులం అని మొత్తుకున్నప్పటికీ తాలిబన్లు వినిపించుకోలేదు. జర్నలిస్టులను తఖీ దర్‌యాబీ, నీమతుల్లా నక్దీగా గుర్తించారు.
 
తమను ఎగతాళి చేస్తూ చితకబాదారు. తాలిబన్లు తమను చంపేస్తారేమో అని భయం కలిగిందని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో కొంత మంది జర్నలిస్టులను అపహరించి, ఆ తర్వాత విడుదల చేశారని పేర్కొన్నారు. 
 
ఆప్ఘనిస్థాన్‌లో పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తామని తాలిబన్లు ప్రకటించినప్పటికీ వారి చర్యలు మరోలా ఉన్నాయని జర్నలిస్టులు తెలిపారు. ఆప్ఘన్ ప్రజల నిరసనలను, ఇతర కార్యక్రమాలను కవర్ చేయొద్దని తాలిబన్లు జర్నలిస్టులను హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments