Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైరు పంక్చర్ కావడంతో రోడ్డుపై అడ్డం తిరిగిన బస్సు.. ఢీకొట్టిన మరో బస్సు...

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (13:14 IST)
కొంతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు టైరు పంక్చర్ కావడంతో రోడ్డుకు అడ్డంగా తిరిగింది. సరిగ్గా అదేసమయంలో వేగంగా వస్తున్న మరో బస్సు.. రోడ్డుపై అడ్డం తిరిగిన బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది దాకా గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం సెనెగల్‌లో జరిగింది. 
 
ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో జరిగిందని సెనెగల్ అధ్యక్షుడు మాకే సాల్ వెల్లడించారు. గ్నిబీలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 40 మంది చనిపోగా, అనేక మంది తీవ్ర గాయాలయ్యాయని ఆయన ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నానని చెప్పారు. మృతి పట్ల సోమవారం నుంచి మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. రోడ్డు భద్రతా చర్యలపై చర్చించేందుకు అంతర్ మంత్రిత్వ మండలిని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 
 
అలాగే, ఈ ప్రమాదంపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీక్ డియోంగ్ మాట్లాడుతూ, ప్రభుత్వ బస్సు టైరు పంక్చర్ కావడంతో రోడ్డుపై బస్సు అడ్డం తిరిగిందని, ఆ సమయంలో ఎదురుగా వస్తున్న మరో బస్సు ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనలో 78 మందికి గాయాలయ్యాని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Adah Sharma: ఆదా శర్మ బ్యూటీ సీక్రెట్ ఇదే.. క్యారెట్, ఎర్రకారం వుంటే?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ఓటింగ్ ట్రెండ్స్- డేంజర్ జోన్‌లో ఎవరు?

శివకార్తికేయన్‌పై రజనీకాంత్ ప్రశంసలు.. యాక్షన్ హీరో అయిపోయావంటూ కితాబు

Thaman: తెలుగు ఇండియన్ ఐడల్ షో గల్లీ టు గ్లోబల్ అయింది : అల్లు అరవింద్

కానిస్టేబుల్ ట్రైలర్ విశేష స్పందనతో సినిమాపై నమ్మకం వచ్చింది : వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments