Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైరు పంక్చర్ కావడంతో రోడ్డుపై అడ్డం తిరిగిన బస్సు.. ఢీకొట్టిన మరో బస్సు...

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (13:14 IST)
కొంతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు టైరు పంక్చర్ కావడంతో రోడ్డుకు అడ్డంగా తిరిగింది. సరిగ్గా అదేసమయంలో వేగంగా వస్తున్న మరో బస్సు.. రోడ్డుపై అడ్డం తిరిగిన బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది దాకా గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం సెనెగల్‌లో జరిగింది. 
 
ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో జరిగిందని సెనెగల్ అధ్యక్షుడు మాకే సాల్ వెల్లడించారు. గ్నిబీలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 40 మంది చనిపోగా, అనేక మంది తీవ్ర గాయాలయ్యాయని ఆయన ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నానని చెప్పారు. మృతి పట్ల సోమవారం నుంచి మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. రోడ్డు భద్రతా చర్యలపై చర్చించేందుకు అంతర్ మంత్రిత్వ మండలిని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 
 
అలాగే, ఈ ప్రమాదంపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీక్ డియోంగ్ మాట్లాడుతూ, ప్రభుత్వ బస్సు టైరు పంక్చర్ కావడంతో రోడ్డుపై బస్సు అడ్డం తిరిగిందని, ఆ సమయంలో ఎదురుగా వస్తున్న మరో బస్సు ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనలో 78 మందికి గాయాలయ్యాని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments