Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌ రైల్వే స్టేషన్‌పై రష్యా క్షిపణి దాడి - 22 మంది మృతి

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (12:37 IST)
గత ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోంది. నెలలు గడిచిపోతున్నప్పటికీ ఈ యుద్ధానికి అంతం అనేది కనిపించడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 22 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 
 
మరోవైపు, ఉక్రెయిన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమపై రష్యా ఎన్ని దాడులు చేసినా వెనుకంజ వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాతో పాటు ఇతర ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. 
 
తాజాగా దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూనైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు వీడీయో ప్రసంగం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దళాలు దాడులు మొదలుపెట్టిన ఆరు నెలల వ్యవధిలో తమ దేశ స్వాతంత్ర్యం దినోత్సవం రోజున రష్యా చేసిన ఈ దాడి అసహ్యమైనదన్నారు. 
 
తమను రెచ్చగొట్టే విధంగా ఉందన్నారు. రష్యా చేసిన ప్రతి దానికీ ఆ దేశం బాధ్యత వహించేలా చేస్తామన్నారు. తాజాగా జరిపిన క్షిపణి దాడిలో మరో 22 మంది చనిపోయారని జెలెన్ స్కీ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments