Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌ మసీదుపై బాంబు పేలుడు-20 మందికిపైగా మృతి

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (10:26 IST)
ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. కాబూల్ మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా బాంబు పేల్చారు. ఈ ఘటనలో కనీసం 20మందికి పైగా మరణించి ఉంటారని తెలుస్తోంది. మరో 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. 
 
బుధవారం సాయంత్రం ఆప్ఘన్ మసీదులో ప్రార్థనలు జరుగుతున్న వేళ ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో ఏడేళ్ల చిన్నారి సహా 27 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది.  
 
ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా తాలిబన్లు ఇటీవలే సంబరాలు చేసుకున్నారు. అంతలోనే మసీదుపై దాడులు జరగడం గమనార్హం. ఈ పేలుడిపై ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments