Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓహియో రాష్ట్రంలో కాల్పులు... నలుగురు మృతి

gun shot
, ఆదివారం, 7 ఆగస్టు 2022 (17:18 IST)
అమెరికాలో మరో ఉన్మాది తుపాకీతో విరుచుకుపడ్డాడు. ఓహియో రాష్ట్రం బట్లర్ టౌన్ షిప్‌లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తి కారులో పరారయ్యాడు. కారు వివరాల ఆధారంగా పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
దుండగుడి కారు ఫొటోను పోలీసులు విడుదల చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. నిందితుడిని స్టీఫెన్ మల్రోగా అనుమానిస్తున్నట్టు బట్లర్ టౌన్ షిప్ పోలీసు చీఫ్ జాన్ పోర్టర్ తెలిపారు. 
 
ఎఫ్‌బీఐ, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్ ప్లోజివ్స్ తరఫున గాలింపు చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు. నిందితుడికి లెక్సింగ్టన్, కెంటకీ, ఇండియానాపోలిస్, చికాగోలతో సంబంధం ఉందని, ఈ పట్టణాల్లో ఎక్కడైనా ఉండొచ్చని ఎఫ్‌బీఐ పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖపట్టణంలో డ్రగ్స్ దందా - ఐదుగురి అరెస్టు