Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్ దాడులు.. 16మంది ఆప్ఘన్ సైనికుల మృతి

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (14:11 IST)
Afghanistan
ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని భాగ్ లాన్ ప్రావిన్సులోని గోజార్గాహ్ఎ నూర్ జిల్లాలో సెక్యూరిటీ చెక్ పాయింటుపై తాలిబన్లు దాడి చేశారు. ఈ దాడిలో 16 మంది ఆఫ్ఘాన్ సెక్యూరిటీ సిబ్బంది మరణించారు. ఈ దాడి ఘటనలో మరో 10 మంది గాయపడ్డారని ఆఫ్ఘనిస్థాన్ అధికారులు చెప్పారు. 
 
తాలిబన్లు పోలీసు హెడ్ క్వార్టర్సుకు సమీపంలోనే దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి ఒమర్ జవాక్, నవా జిల్లాలో జరిగిన ప్రమాదాన్ని ధృవీకరించారు. వైమానిక దాడుల కారణంగా 10మంది ఆప్ఘన్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఒమర్ జవాక్ తెలిపారు. 
 
గోజర్గా-ఏ-నూర్ జిల్లాలోని బాగ్లాన్‌ ప్రావిన్స్‌లోని పోలీసుల హెడ్‌క్వార్టర్స్‌ సమీపంలో తాలిబన్లకు భద్రతాదళాలకు మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అంతర్-ఆఫ్ఘన్ చర్చలను ప్రారంభించేలా ఖైదీల మార్పిడీకి అష్రఫ్ ఘని ప్రభుత్వం తాలిబన్లతో శాంతిచర్చలు జరపుతున్నాదాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. 
 
దాదాపు రెండు దశాబ్దాలపాటు కొనసాగిన యుద్ధంలో పదివేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గత రెండు నెలల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం- తాలిబాన్ల మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments