Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్ దాడులు.. 16మంది ఆప్ఘన్ సైనికుల మృతి

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (14:11 IST)
Afghanistan
ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని భాగ్ లాన్ ప్రావిన్సులోని గోజార్గాహ్ఎ నూర్ జిల్లాలో సెక్యూరిటీ చెక్ పాయింటుపై తాలిబన్లు దాడి చేశారు. ఈ దాడిలో 16 మంది ఆఫ్ఘాన్ సెక్యూరిటీ సిబ్బంది మరణించారు. ఈ దాడి ఘటనలో మరో 10 మంది గాయపడ్డారని ఆఫ్ఘనిస్థాన్ అధికారులు చెప్పారు. 
 
తాలిబన్లు పోలీసు హెడ్ క్వార్టర్సుకు సమీపంలోనే దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి ఒమర్ జవాక్, నవా జిల్లాలో జరిగిన ప్రమాదాన్ని ధృవీకరించారు. వైమానిక దాడుల కారణంగా 10మంది ఆప్ఘన్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఒమర్ జవాక్ తెలిపారు. 
 
గోజర్గా-ఏ-నూర్ జిల్లాలోని బాగ్లాన్‌ ప్రావిన్స్‌లోని పోలీసుల హెడ్‌క్వార్టర్స్‌ సమీపంలో తాలిబన్లకు భద్రతాదళాలకు మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అంతర్-ఆఫ్ఘన్ చర్చలను ప్రారంభించేలా ఖైదీల మార్పిడీకి అష్రఫ్ ఘని ప్రభుత్వం తాలిబన్లతో శాంతిచర్చలు జరపుతున్నాదాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. 
 
దాదాపు రెండు దశాబ్దాలపాటు కొనసాగిన యుద్ధంలో పదివేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గత రెండు నెలల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం- తాలిబాన్ల మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments