Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆప్ఘనిస్థాన్‌లో కరోనా.. వున్నది 8 కేంద్రాలే.. 100 మందికే పరీక్ష

ఆప్ఘనిస్థాన్‌లో కరోనా.. వున్నది 8 కేంద్రాలే.. 100 మందికే పరీక్ష
, గురువారం, 7 మే 2020 (17:15 IST)
ఆప్ఘనిస్థాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కాబూల్‌లో ఇఫ్పటికే 500మందికి ర్యాండమ్ టెస్ట్ నిర్వహించగా, 50 శాతం మంది ఇన్ఫెక్షన్‌కు గురైనట్టు తేలిందని ఐవోఎం తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్‌లో కోవిడ్-19 పరీక్షలకు ఏర్పాటైన కేంద్రాలు 8 మాత్రమే. వీటిలో రోజుకు 100 నుంచి 150 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించే వీలుంది. 
 
ఉగ్రవాదుల ప్రభావం వల్ల ఆఫ్ఘన్‌లోని 30 శాతం ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించేందుకే అవకాశం లేదు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సగటు ఆయుర్దాయం 50 ఏళ్ళు మాత్రమే. టీబీ, హెచ్‌ఐవి, పౌష్టికాహార లోపం, క్యాన్సర్, గుండె, శ్వాస సంబంధ వ్యాధులు ఆ దేశ ప్రజల్ని పీడిస్తున్నాయి. 
 
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా బారిన పడే దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ ముందుండే అవకాశం ఉందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా తగిన వైద్య సదుపాయాలు లేకపోవడంతో దేశ జనాభాలో దాదాపు 80 శాతం కరోనా బారిన పడే ప్రమాద చెందుతోంది. మే 5 వరకు ఆప్ఘనిస్థాన్‌లో 2900 కేసులు నమోదు కాగా, 90 మంది మరణించారు.
 
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటికే ఇరాన్, పాకిస్థాన్‌ల నుంచి 2,71,000మంది ఆఫ్ఘన్‌కు చేరుకున్నారు. వీరి ద్వారా కరోనా వాపిస్తుందన్న ఆందోళన కూడా ఆ దేశ అధికారుల్లో నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ మృతుల కుటుంబాలకు కోటి -వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నవారికి 10 లక్షలు నష్టపరిహారం: జగన్‌