Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున నెయ్యి తింటే ఇన్ని ప్రయోజనాలా???

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (10:28 IST)
మ‌న‌లో చాలామంది నెయ్యిని ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని కూర‌ల్లో వేసుకుంటారు. కొంద‌రు భోజ‌నం చేసేట‌ప్పుడు అందులో క‌లుపుకుని తింటారు. ఇక కొంద‌రైతే నెయ్యితో తీపి వంట‌కాల‌ను చేసుకుని తింటారు. అయితే ఇలా కాకుండా రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఒక టీస్పూన్ నెయ్యి తింటే చాలా అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. నెయ్యి తిన్న వెంట‌నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తాగాల్సి ఉంటుంది. దీంతో మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మై ప్ర‌యోజ‌నాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.  
 
రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున నెయ్యి తింటే జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. జీర్ణాశ‌యంలో అగ్ని పెరుగుతుంది. దీంతో తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య‌లు కూడా బాధించ‌వని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వారు నేడు మ‌న దేశంలో చాలామందే ఉన్నారు. అలాంటివారు నెయ్యిని తీసుకోవాలి. దీంతో విట‌మిన్ ఎ పుష్క‌లంగా ల‌భించి తద్వారా నేత్ర స‌మ‌స్య‌లు పోతాయి. 
 
అంతేకాకుండా నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌నే భావ‌న చాలామందిలో ఉంది. అయితే నిజానికి నెయ్యి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచ‌దు. మంచి కొలెస్ట్రాల్‌నే పెంచుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. గ‌ర్భిణీ మ‌హిళ‌లైతే నిత్యం నెయ్యిని క‌చ్చితంగా తీసుకోవాల్సిందేన‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే నెయ్యిని రోజూ తింటే దాంతో ఎన్నో కీల‌క పోష‌కాలు గ‌ర్భిణీ స్త్రీలకు ల‌భిస్తాయి. దాంతోపాటు పిండం చ‌క్క‌గా ఎదుగుతుందట. నెయ్యిని రోజూ తింటుంటే ముఖం కూడా కాంతివంతంగా మారుతుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, మ‌డ‌త‌లు, మొటిమ‌లు కూడా పోతాయి. 
 
యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు నెయ్యిలో అధికంగా ఉన్నాయి. అందువ‌ల్ల నెయ్యిని తింటుంటే శ‌రీరంపై అయిన గాయాలు, పుండ్లు ఇట్టే త‌గ్గిపోతాయి. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ కూడా ల‌భిస్తుంది. నెయ్యిని నిత్యం తింటుంటే శ‌రీర రోగనిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఆయుర్వేద ప్ర‌కారం నెయ్యి పాజిటివ్ ఫుడ్‌. ఇది మిగ‌తా కొవ్వులు, నూనెల్లా కాదు. శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. నెయ్యిలో ఉండే విట‌మిన్ డి ఎముక‌లకు మేలు చేస్తుంది. ఎముక‌లు, దంతాలు దృఢంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఐతే కొద్ది మోతాదులో మాత్రమే నెయ్యిని తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రాణాలను కాపాడే రక్తదాన కార్యక్రమంలో ముందున్న కెఎల్‌హెచ్‌ ఎన్ఎస్ఎస్

andhra pradesh weather report today ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Sri Reddy: పోలీసుల విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి.. క్షమించమని కోరినా వదల్లేదు

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

తర్వాతి కథనం
Show comments