Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపునే ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే...

చాలామంది నిద్రలేవగానే ఓ చెంబుడు మంచినీరు తాగుతారు. ఇంకొందరు బెడ్ కాఫీ లేదా టీ తాగుతారు. ఇది చాలా మందికి ఉండే అలవాటు. కానీ, నిద్రలేవగానే పరగడుపున ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే అనేక రకాల అనారోగ్య సమస్యలకు దూ

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (08:43 IST)
చాలామంది నిద్రలేవగానే ఓ చెంబుడు మంచినీరు తాగుతారు. ఇంకొందరు బెడ్ కాఫీ లేదా టీ తాగుతారు. ఇది చాలా మందికి ఉండే అలవాటు. కానీ, నిద్రలేవగానే పరగడుపున ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే అనేక రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని సమాచారం. అందువల్ల ఓ గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
మజ్జిగలో ప్రొబయోటిక్ బాక్టీరియా ఉంటుంది. అందువల్ల ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తాగితే జీర్ణ సమస్యలు మాయమవుతాయి. ముఖ్యంగా కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అల్సర్ సమస్యలు ఉన్నవారు ఇలా తాగితే వీటి నుంచి బయటపడొచ్చట. 
 
అలాగే, ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తాగడం వల్ల జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. వాటిల్లో ఉండే హానికారక క్రిములు, బాక్టీరియా నశిస్తాయి. మంచి బాక్టీరియా పెరుగుతుంది. ఇది అజీర్తి, మలబద్దకం సమస్యలను దూరం చేస్తుంది. 
 
మజ్జిగలో రెండు మూడు కరివేపాకు ఆకులు, అర టీస్పూన్ మిరియాల పొడి కలిపి తాగితే ఇంకా ఎంతో లాభం ఉంటుంది. శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరుగుతుంది. శరీరంలో చక్కెర నిల్వల స్థాయి నియంత్రణలో ఉంటుందట. 
 
విరేచనాలతో బాధపడేవారు ఉదయాన్నే పరగడుపున మజ్జిగలో అర టీ స్పూన్ అల్లం రసం కలిపి తాగితే విరేచనాలు తగ్గుముఖం పడతాయట. హైబీపీ ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున గ్లాస్ మజ్జిగ తాగితే ఫలితం ఉంటుందని గృహ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments