ఇలా స్నానం చేస్తే రోగాలు అస్సలు రావు...

స్నానం చేయడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిసిందే. దేహాన్ని శుభ్రంగా ఉంచడమే కాదు.. మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికి కూడా స్నానం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే స్నానం చేసే సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే దేహానికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని జ్యోతి

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (20:03 IST)
స్నానం చేయడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిసిందే. దేహాన్ని శుభ్రంగా ఉంచడమే కాదు.. మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికి కూడా స్నానం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే స్నానం చేసే సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే దేహానికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని జ్యోతిష్యం చెబుతోంది.
 
స్నానం చేసే ముందు నీటిలో కొద్దిగా నువ్వులను కలపాలి. ఐదు నిమిషాలు ఆగి ఆ నీటితో స్నానం చేయాలి. దీని వల్ల ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దాంతో అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. తలస్నానం చేసేటప్పుడు అయితే ముందుగా నీటిని తలపై పోసుకోవాలి. ఆ తరువాతే కింద భాగంలో నీరు పోయాలి. ఇలా చేయడం వల్ల ఒంట్లో ఉన్న విష పదార్థాలు పోవడమే కాకుండా శరీరంలోని వేడి తగ్గుతుంది. చలువ చేకూరుతుంది.
 
ఇప్పుడు చాలా కారణాల వల్ల కొంతమంది లేటుగా నిద్రలేచి ఎప్పుడో మధ్యాహ్నం తరువాత స్నానం చేస్తున్నారు. కొందరయితే ఉదయమంతా మానేసి రాత్రి పూట స్నానం చేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. వేకువ జామునే అంటే సూర్యుడు ఉదయించక ముందే తలస్నానం చేస్తే చాలా మంచిది.
 
స్నానం చేయడానికి అర్థగంట ముందే మీ శరీరాన్ని మీరే మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు రక్తప్రసరణ సరిగ్గా సాగుతుంది. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. స్నానం చేయడానికి ముందు షేవింగ్ అస్సలు చేయకూడదు. అలా చేస్తే చర్మం పాడవుతుంది. రంధ్రాలు పడతాయి. 
 
వ్యాయామం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. కొంతసేపు విరామం ఇచ్చిన తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు వంటి శ్వాసకోస సమస్యలు రావు. ఏదైనా నదుల్లో దిగేముందు ఓం అని అనుకోవాలి. అలా చేయడం చాలా మంచిది. అలా చెప్పడం వల్ల చాలామంచి జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments