Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు వాడే టూత్ పేస్ట్ సరైనదేనా అని తెలుసుకోవటం ఎలా? (video)

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (10:12 IST)
నవ్వుకు దంతాలు మరింత అందాన్నిస్తాయి. దంతాల పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలం. దేశంలోని ప్రజలు దాదాపు 51 శాతం మాత్రమే టూత్ పేస్టు, టూత్ బ్రష్‌ను వాడుతున్నారంటే నమ్మబుద్ధి కావట్లేదు కదూ... అందునా భారతదేశంలో నివసించే ప్రజల్లో దంత సమస్యలపై లేదా దంతాలను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకోలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం దంతాలపై అవగాహన లేకపోవడమేనంటున్నారు వైద్యులు. 
 
దేశంలోని కేవలం 19 శాతం మంది ప్రజలు మాత్రమే ఉదయం, రాత్రి రెండు పూటలా దంతావధానం చేస్తున్నట్లు ఓ సర్వేలో తెలిసింది. అలగే పంటి నొప్పి కలిగినప్పుడు దేశంలోని 82 శాతం మంది ప్రజలు వైద్యుల వద్దకు వెళ్ళి చికిత్స చేసుకునేందుకు వెనుకాడుతున్నారు. అదే నూరు మందిలో కేవలం ముగ్గురు మాత్రమే నిత్యం ప్రతి ఏడాదికి ఒకసారి తమ దంత పరీక్షల కొరకు వైద్యుల వద్దకు వెళుతుంటారని ఆ సర్వే ఫలితాలు వెలువరించింది.
 
టూత్ పౌడర్ లేదా టూత్ పేస్ట్
దంతావధానం చేసేందుకు టూత్ పౌడర్ లేదా టూత్ పేస్ట్ ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి మాత్రమే ఎంచుకోవాలి. ఎందుకంటే వీటిలో ఏదో ఒకదానితోనే బ్రష్ చేయగలుగుతారు. దీంతో దంతావధానం సరిగా చేయగలుగుతారు. ఒకవేళ మీరు టూత్ పౌడర్‌ను వినియోగించాలనుకుంటే ఆ పౌడర్ నున్నగా ఉండేలా చూసుకోండి. 
 
మీరు వాడే టూత్ పేస్ట్ ఎలా ఉండాలంటే...
* ఏదైనా మంచి కంపెనీ లేదా మంచి బ్రాండ్ కలిగిన టూత్ పేస్ట్‌ను ఉపయోగించండి.
* టూత్ పేస్ట రంగు, రుచి, సువాసనకు బదులుగా దాని పనితనమెంతో తెలుసుకోండి. 
* ఆహారం లేదా నీరు తీసుకునే సమయంలో మీ దంతాలకు చల్లగా-వేడిగా అనిపిస్తే మెడికేటెడ్ టూత్‌పేస్ట్‌ను ఉపయోగించండి. 
 * ఎక్కువ వైటనర్స్ కలిగిన టూత్ పేస్ట్‌ను ఎక్కువకాలంపాటు వాడటం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు దంతవైద్య నిపుణులు. 
 
* ఫ్లోరైడ్‌తో కూడుకున్న టూత్ పేస్ట్‌ను వాడదలచుకుంటే వైద్యుల సలహా మేరకు వాడండి.
* చిన్నపిల్లలకు ఫ్లోరైడ్‌తో కూడుకున్న టూత్ పేస్ట్ ఇవ్వకండి. 
* ఎట్టి పరిస్థితుల్లోను ఏ రకానికి చెందిన టూత్ పేస్ట్‌ను మింగకండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

తర్వాతి కథనం
Show comments