Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిగుడ్లను ఉడకబెట్టి తింటే మేలెంత?

కోడిగుడ్ల ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. కోడిగుడ్లలో వుండే పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి 12, మెగ్నిషియం, శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్‌శాచురేటెడ

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2017 (09:49 IST)
కోడిగుడ్ల ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. కోడిగుడ్లలో వుండే పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి 12, మెగ్నిషియం,  శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు వుంటాయి. ఇవి శరీరానికి అందడం ద్వారా పలు అనారోగ్య సమస్యలు తలెత్తవు. రోజుకో కోడిగుడ్డును తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగినట్లేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
కోడిగుడ్లను ఉడకబెట్టి తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. అయితే ఉడికించిన కోడిగుడ్లను అప్పుడే తినేయడం మంచిది. గంటల పాటు బాక్సుల్లో వుంచి తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే.. ఉడికిన గుడ్డుపై బాక్టీరియా, వైరస్‌లు త్వరగా చేరి అవి కంటామినేట్ అవుతాయి. కనుక ఉడికిన గుడ్డును 3 గంటల్లోపే తినేయడం మంచిది. పొట్టు తీసిన బాయిల్డ్ ఎగ్స్‌ను ఒక్క రోజు కంటే ఎక్కువ ఫ్రిజ్‌లో నిల్వ వుంచకూడదు. 
 
ఒక కోడిగుడ్డును ఉకడబెట్టుకుని పచ్చ సొనతోపాటుగా తింటే రోజుకు ఒక గుడ్డు చాలు. ఒబిసిటీ వున్నవారు తెల్లసొన మాత్రమే తినాలి. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. ఇక మధుమేహం ఉన్నవారు వారానికి రెండు గుడ్లను తినవచ్చు. అది కూడా పచ్చ సొనతో కలిపి తినకుండా ఉంటే బెటరని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో తెలుగు మహిళ!

తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన రష్యా.. మాస్కోలో కొత్త ఆఫ్ఘన్ రాయబారి...

లండన్‌లో జల్సాలు - పార్టీలో పాటలు పాడిన విజయ్ మాల్యా - లలిత్ మోడీ!

కోల్‌కతా న్యాయ విద్యార్థిని అత్యాచార కేసులో విస్తుపోయే నిజాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments