Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరువెచ్చని నీటిని ఉదయాన్నే తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (21:51 IST)
ఉదయాన్నే గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. బరువు తగ్గడం నుండి చర్మ ఆరోగ్యం వరకు, వేడి నీరు అనేక ఆరోగ్య సమస్యలకు మేలు చేస్తుంది. అయితే వేడినీళ్లు తాగడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. చాలామందికి దీని గురించి అవగాహన లేదనీ, ఈ వేడినీరు అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అంటున్నారు.

 
ఎక్కువ వేడి నీరు తాగటం వల్ల నోటిపూత, నోటిలో చిన్న కాలిన గాయాలకు కారణమైతే, అది ఖచ్చితంగా శరీరంలోని అంతర్గత అవయవాల లైనింగ్‌పై ప్రభావం చూపుతుంది. అత్యంత సాధారణంగా ప్రభావితమైన అవయవాలు అన్నవాహిక మరియు జీర్ణవ్యవస్థ, ఇవి సున్నితమైన లోపలి పొరను కలిగి ఉంటాయి. వేడి నీటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉండటం వలన అవి ప్రభావితమవుతాయి. కనుక మితిమీరిన వేడినీటిని తాగరాదు.

 
ఇంకా మూత్రపిండాలు అదనపు నీటిని, అన్ని రకాల మలినాలను తొలగించడానికి బలమైన కేశనాళిక వ్యవస్థను కలిగి ఉంటాయి. వేడి నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ఫ్లషింగ్ ప్రక్రియ మెరుగుపడుతుందని లేదా వేగవంతం అవుతుందని అనుకుంటారు కానీ అలా జరగదు. విరుద్ధంగా, అధికంగా వేడి నీటిని తాగడం వల్ల మూత్రపిండాలకు అదనపు పని పెరుగుతుంది. దీంతో హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని నీటి సాంద్రతలో అసమతుల్యత ఏర్పడుతుందని చెబుతారు. ఒకేసారి ఎక్కువ నీరు మెదడు కణాల వాపుకు కారణమవుతుంది. కనుక ఇది మానవ శరీరానికి ప్రమాదకరం.
 
వేడి నీటిని ఎక్కువగా తాగడం కూడా రక్త పరిమాణానికి ప్రమాదకరం. అవసరమైన దానికంటే ఎక్కువ వేడి నీటిని తీసుకోవడం వల్ల మొత్తం రక్త పరిమాణం పెరుగుతుంది. రక్త ప్రసరణ అనేది ఒక క్లోజ్డ్ సిస్టమ్. అది అనవసరమైన ఒత్తిడిని పొందినట్లయితే, అది అధిక రక్తపోటుతో పాటు అనేక ఇతర గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

తర్వాతి కథనం
Show comments