ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆ మొబైల్ నంబర్లపై యూపీఐ సేవలు బంద్!

ఠాగూర్
శుక్రవారం, 21 మార్చి 2025 (16:35 IST)
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొన్ని రకాలైన మొబైల్ నంబర్లకు యూపీఐ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ) ఆదేశాలు జారీచేసింది. ఇన్‌యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి యూపీఐ సేవలు నిలిపివేయాలని, ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సేవలు అందించే ప్రొవైడర్లకు ఎన్.పి.సి.ఐ ఆదేశాలు జారీచేసింది. 
 
అనధికారిక వాడకాన్ని, మోసాలను అరికట్టేందుకు ఆ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని సూచించింది. యూపీఐ వినియోగంలో మొబైల్ నంబర్లు కీలకం. ఈ సేవల్లో ఓటీపీ వెరిఫికేషన్ కీలక భూమిక పోషిస్తుంది. అందుకే ఎన్.పి.సి.ఐ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ప్రధానంగా దీర్ఘకాలంగా వినియోగంలో లేని మొబైల్ నంబర్లను టెలికాం కంపెనీలు వేరొకరికి కేటాయిస్తుంటాయి. దీంతో దీర్ఘకాలం పాటు మనం వాడే నంబర్లు వేరొకరు ఉపయోగిస్తుంటారు. దాంతో యూపీఏ ఖాతాలు కూడా వారి చేతుల్లోకి వెళ్లే ఆస్కారం ఉంది. దీనివల్ల అనధికారిక, మోసపూరిత లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. వీటిని నివారించేందుకు వీలుగా ఎన్.పి.సి.ఐ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్‌తో పాటు బ్యాంకులు ఇన్‌యాక్టివ్‌‍ నంబర్లను తొలగించనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Roshan: ఛాంపియన్: షూటింగ్లో కొన్ని గాయాలు అయ్యాయి : రోషన్

Kokkoroko: రమేష్ వర్మ నిర్మాణ సంస్థ చిత్రం కొక్కోరొకో షూటింగ్ పూర్తి

మైథలాజికల్ రూరల్ డ్రామా కథ తో అవినాష్ తిరువీధుల .. వానర సినిమా

Sridevi Appalla: బ్యాండ్ మేళం... ఎవ్రీ బీట్ హేస్ ఎన్ ఎమోషన్ అంటోన్న శ్రీదేవి అపళ్ల‌

శంబాలా సినిమా చాలా డిఫరెంట్ కథ, సక్సెస్ కొట్టబోతున్నాం: నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జిమ్‌లో అధిక బరువులు ఎత్తితే.. కంటి చూపుపోతుందా?

winter beauty tips, కలబందతో సౌందర్యం

గుంటూరులో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు

కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గేందుకు సాయపడే అలసందలు

కేన్సర్ ముందస్తు నిర్ధారణ పరీక్ష... ఖర్చు ఎంతంటే?

తర్వాతి కథనం
Show comments