Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ ఒక్క ఖాకీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : టీడీపీ నేత యరపతినేని

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (19:06 IST)
2024లో జరిగే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని, ఆ తర్వాత తమను వేధించిన, తమపై తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్క పోలీస్ అంతు చూస్తామని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు హెచ్చరించారు. 
 
ఇటీవల మాచర్ జిల్లాలో వైకాపా నేతలు చేసిన దమనకాండపై ఆయన మాట్లాడుతూ, మాచర్ల నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలకు పోలీసుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. మాచర్లలో జరిగిన అల్లర్లతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు భయపెడుతున్నారన్నారు. పైగా, మాచర్లలో సైతం భయానక వాతావరణం సృష్టిస్తున్నారని తెలిపారు. 
 
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన, పెడుతున్న ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబుల్, అధికారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వైకాపా ఆరిపోయే దీపమని, రానున్న రోజుల్లో వైకాపా నేతలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. అదేసమయంలో వైకాపా నేతలు, పోలీసులు కుమ్మక్కై వేధింపులకు గురిచేసినా టీడీపీ కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments