Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ ఒక్క ఖాకీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : టీడీపీ నేత యరపతినేని

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (19:06 IST)
2024లో జరిగే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని, ఆ తర్వాత తమను వేధించిన, తమపై తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్క పోలీస్ అంతు చూస్తామని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు హెచ్చరించారు. 
 
ఇటీవల మాచర్ జిల్లాలో వైకాపా నేతలు చేసిన దమనకాండపై ఆయన మాట్లాడుతూ, మాచర్ల నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలకు పోలీసుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. మాచర్లలో జరిగిన అల్లర్లతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు భయపెడుతున్నారన్నారు. పైగా, మాచర్లలో సైతం భయానక వాతావరణం సృష్టిస్తున్నారని తెలిపారు. 
 
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన, పెడుతున్న ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబుల్, అధికారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వైకాపా ఆరిపోయే దీపమని, రానున్న రోజుల్లో వైకాపా నేతలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. అదేసమయంలో వైకాపా నేతలు, పోలీసులు కుమ్మక్కై వేధింపులకు గురిచేసినా టీడీపీ కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments