Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్సిల్ షేవింగ్స్ గొంతులో ఇరుక్కుని ఆరేళ్ళ చిన్నారి మృతి

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (19:02 IST)
పెన్సిల్ షేవింగ్స్ గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ రాష్ట్రంలోని హమీర్ పూర్ కొత్వాలి ప్రాంతంలో పహాడీ వీర్ గ్రామంలో నందకిషోర్ అనే వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో ఉంటున్నారు. బుధవారం సాయంత్రం కుమారుడు అభిషేక్ (12), కుమార్తె అన్షిక (8), ఆర్తిక (6)లు ఇంటి మిద్దెపై కూర్చుని చదువుకుంటున్నారు. అయితే, ఒకటో తరగతి చదవుతున్న ఆర్తిక హోం వర్క్ చేసేందుకు తన నోటిలో షార్ప్‌నర్ పెట్టుకుని పెన్సిల్ తిప్పంది. 
 
ఈ క్రమంలో షార్ప్‌నర్ నుంచి వచ్చిన పెన్సిల్ షేవింగ్స్ ఆ బాలిక నోటిలోకి వెళ్లింది. దీంతో ఆ బాలికకు ఊపిరాడక స్పృహతప్పి పడిపోయింది. ఈ విషయాన్ని అన్షిక్, అభిషేక్‌లు కింద వున్న తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆ బాలిక మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఆర్తిక మరణంతో తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments