భార్య చనువుగా వుండలేదని.. ప్రియుడి ఇంటికి నిప్పంటించాడు..

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (15:43 IST)
వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ భర్త భార్య ప్రియుడి ఇంటికి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెల్కలపల్లిలో ఈ తరహా సంఘటన జరిగింది.
 
బెజ్జింకి మండలం ముత్తనపేటకు చెందిన ఓ వ్యక్తికి చిన్నకోడూరు మండలం చెల్కలపల్లికి చెందిన మహిళతో కొన్ని నెలల క్రితం పెళ్లి జరిగింది. కొని నెలల తర్వాత అతడు భార్యను చెల్కలపల్లిలోని పుట్టింట్లో వదిలేసి ఉపాధి కోసం ముంబైకి వెళ్లాడు.
 
ఆమె చెల్కలపల్లిలోని తన స్నేహితురాలి ఇంటికి తరచూ వెళ్లేది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆమె భర్త నెల రోజుల క్రితం తిరిగి వచ్చాడు. భార్య తనతో సరిగా ఉండడం లేదని అతడు అనుమానించడం మొదలు పెట్టాడు. స్నేహితురాలి తండ్రితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భావించాడు. ఈ విషయమై ఆమెతో తరచూ గొడవపడే వాడు. 
 
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి చెల్కలపల్లికి వెళ్లి ఆ అనుమానిత వ్యక్తి ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలు ఎగసి పడడంతో స్థానికులు అప్రమత్తమై ఆర్పేసారు. బాధితుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిబ్రవరి 14న వివాహం చేసుకోబోతున్న ధనుష్, మృణాల్ ఠాకూర్?

Nabha Natesh: నాగబంధం నుంచి పార్వతిగా సాంప్రదాయ లుక్ లో నభా నటేష్

Sai Durga Tej: పంచె కట్టు ధరించిన సాయి దుర్గతేజ్.. సంబరాల ఏటిగట్టు లుక్

రణధీర్ భీసు-హెబ్బా పటేల్ జంటగా మిరాకిల్ సంక్రాంతి లుక్

పూరీ జగన్నాథ్ కొత్త చిత్రం పేరు 'స్లమ్ డాగ్'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

తర్వాతి కథనం
Show comments