Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పు తిరిగి చెల్లించలేదని.. మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు..

అప్పు తిరిగి చెల్లించలేదని.. మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు..
, సోమవారం, 3 ఆగస్టు 2020 (22:24 IST)
గుంటూరు జిల్లాలో ఈ మధ్య నేరాల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయి. ఒకవైపు మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. మరోవైపు హత్యలు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. అప్పు చెల్లించలేదన్న కోపంతో.. ఓ మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు ఓ దుర్మార్గుడు. 
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు, నకరికల్లు మండలం శివాపురానికి చెందిన రమావంత్ మంత్రూభాయి (55) అనే మహిళ... శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి దగ్గర తన అవసరం నిమిత్తం రూ.3.80 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ అప్పుకు తన పొలాన్ని తాకట్టుగా పెట్టింది. కానీ అప్పు తీర్చాలంటూ శ్రీనివాస్ రెడ్డి ఆమెను వేధించడం మొదలెట్టాడు.
 
ఎక్కడ కనబడితే అక్కడ డబ్బులడిగే శ్రీనివాస్ సోమవారం పొలం వద్దకే వెళ్లాడు. అంతటితో ఆగకుండా అప్పు తీర్చనందుకు సదరు మహిళను ట్రాక్టర్‌తో తొక్కించాడు శ్రీనివాసరెడ్డి.. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌదీలో సంసారం, మోజు తీర్చుకుని ఇండియాకి రాగానే ఆమె ఎవరో తెలియదంటున్నాడు?