Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్య.. ఎక్కడంటే?

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (10:15 IST)
వేద మంత్రాల సాక్షిగా మనువాడిన భర్తను ప్రియుడితో హత్య చేయించింది ఓ కిరాతక భార్య. తన వివాహేతర సంబంధం కొనసాగించడానికి భర్తను పొట్టనబెట్టుకుంది. అయితే పోలీసు విచారణలో ఈ విషయం వెల్లడి కావడంతో భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడు అరెస్టయ్యారు. 
 
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన బోధన్ హనుమబోయి అనే వ్యక్తికి అనురాధతో చాలా సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనురాధ ఉంటున్న కాలనీలోనే ఉంటున్న పోష బోయితో వ్యక్తితో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. 
 
తనకు తన ప్రియుడికి మధ్యలో భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన అనురాధ ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకొని ఇద్దరూ శాశ్వతంగా కలిసి ఉండాలని భావించారు. ఇందులో భాగంగానే ప్రియుడికి భర్తను హత్య చేసే పనిని అప్పగించింది. ఇక హనుమబోయికి బాగా మద్యం తాగించి అతను మత్తులోకి జారుకోగానే తాడుతో గొంతుకు ముడివేసి హత్య చేశారు పోష బోయితో పాటు అతని స్నేహితులు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో తానే ప్రియుడితో కలిసి జీవించాలని భర్తను హత్య చేయించానని ఒప్పుకుంది. దీంతో పోలీసులు అనురాధతో పాటు ఆమె ప్రియుడు పోష బోయి, రమేష్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments