Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్య.. ఎక్కడంటే?

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (10:15 IST)
వేద మంత్రాల సాక్షిగా మనువాడిన భర్తను ప్రియుడితో హత్య చేయించింది ఓ కిరాతక భార్య. తన వివాహేతర సంబంధం కొనసాగించడానికి భర్తను పొట్టనబెట్టుకుంది. అయితే పోలీసు విచారణలో ఈ విషయం వెల్లడి కావడంతో భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడు అరెస్టయ్యారు. 
 
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన బోధన్ హనుమబోయి అనే వ్యక్తికి అనురాధతో చాలా సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనురాధ ఉంటున్న కాలనీలోనే ఉంటున్న పోష బోయితో వ్యక్తితో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. 
 
తనకు తన ప్రియుడికి మధ్యలో భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన అనురాధ ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకొని ఇద్దరూ శాశ్వతంగా కలిసి ఉండాలని భావించారు. ఇందులో భాగంగానే ప్రియుడికి భర్తను హత్య చేసే పనిని అప్పగించింది. ఇక హనుమబోయికి బాగా మద్యం తాగించి అతను మత్తులోకి జారుకోగానే తాడుతో గొంతుకు ముడివేసి హత్య చేశారు పోష బోయితో పాటు అతని స్నేహితులు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో తానే ప్రియుడితో కలిసి జీవించాలని భర్తను హత్య చేయించానని ఒప్పుకుంది. దీంతో పోలీసులు అనురాధతో పాటు ఆమె ప్రియుడు పోష బోయి, రమేష్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేస్తే సారీ చెప్పాలి.. తప్పు చేయకుంటే క్షమాపణ చెప్పను : కమల్ హాసన్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments