గుంటూరులో అదృశ్యమై విజయవాడలో శవమైన మహిళా టెక్కీ

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (11:01 IST)
గుంటూరులో అదృశ్యమైన ఓ మహిళా టెక్కీ విజయవాడలో విగతజీవిగా కనిపించింది. ఆదివారం ఇంటి బయటకు వెళ్లిన తనూజ అనే మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్... విజయవాడలో మృత్యువాతపడింది. దీనిపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని నిర్ధారించారు. దీంతో టెక్కీ తనూజ మరణంపై అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరుకు చెందిన తనూజ అనే యువతి టెక్కీగా పని చేస్తున్నారు. ఈమెకు 2018లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మణికంఠతో వివాహమైంది. బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్న వీరికి ఓ బాబు కూడా ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తనూజ ఆపై ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు తమకు తెలిచిన ప్రదేశాల్లో గాలించారు. అయినా ఫలితం లేదు. ఈ క్రమంలో సోమవారం నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో తనూజ మృతదేహం విజయవాడ మాచర్ల రహదారిలో కనపించింది. 
 
దీంతో ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయివుంటుందని తొలుత పోలీసులు భావించారు. కానీ, ఆమె శరీరంపై చిన్నపాటి గాయం లేదా రక్తపు మరక లేకపోవడంతో పోలీసులు హత్యగా భావించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments