భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

ఠాగూర్
ఆదివారం, 10 ఆగస్టు 2025 (17:59 IST)
కట్టుకున్న భర్తతో గొడవలతో విసుగెత్తిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బండా జిల్లాలోని రిసౌరా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... రిసౌరా గ్రామానికి చెందిన రీనా, అఖిలేశ్ అనే దంపతులుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. శుక్రవారం రాత్రి  భర్తతో గొడవ జరగడంతో పిల్లలను తీసుకుని ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఉదయం లేచి చూడగా కోడలు, పిల్లలు కనిపించలేదు. 
 
దీంతో అత్తామామలు, ఇరుగు పొరుగువారు కలిసి వారి కోసం గాలించగా, ఊరికి శివారులో ఉన్న కెన్ కాలువ వద్ద దుస్తులు, గాజులు, చెప్పులు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు  వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. వారు గజ ఈతగాళ్ళతో వచ్చి కాలువలో గాలించగా మూడు మృతదేహాలను వెలికి తీశారు. మృతులను రీనా (30), హిమాన్షు (9), అన్షి (5), ప్రిన్స్ (3) అనేవారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments