బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

ఠాగూర్
ఆదివారం, 10 ఆగస్టు 2025 (17:48 IST)
కడప జిల్లాలోని పులివెందుల జడ్జీటీసీ ఉప ఎన్నిక ఇపుడు రసవత్తరంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత ఊరు, సొంత నియోజకవర్గం కావడంతో పులివెందుల జడ్పీటీసీ చైర్మన్ ఎన్నికపై ఇపుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ శ్రేణులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు ఖైదీల వేషాలు ధరించి డప్పులు వాయిస్తూ వీధుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. 
 
ఈ నెల 12వ తేదీన జరగనున్న జడ్జీటీసీ స్థానానికి సంబంధించిన ఉప ఎన్నికల పోలింగ్ కోసం ఈ ప్రచారం జరుగుతోంది. ఇందులోభాగంగా, బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా అనే నినాదంతో ముందుకు దూసుకెళుతున్నారు. పులివెందులలోని పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు ఈ ప్రత్యేకమైన వేషాధారణంలో డప్పు వాయిద్యాల మధ్య నినాదాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
ఈ ప్రచార సరళి అందరిని దృష్టిని ఆకర్షిస్తోంది. ఖైదీల దుస్తుల్లో ఉన్న కార్యకర్తలు డప్పులు కొడుతూ ముందుకు సాగుతుండగా, మరికొందరు ఈ నినాదాన్ని గట్టిగా నినదిస్తున్నారు. ఈ వినూత్న ప్రచారానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.  


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments