Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Advertiesment
Satish has been located in kadapa

ఐవీఆర్

, సోమవారం, 28 జులై 2025 (20:23 IST)
2024 అసెంబ్లీ ఎన్నికల పర్యటన సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైన గులక రాయి విసిరి ఆయనకు గాయాలు కావడానికి కారణమైన సతీష్ ఆచూకి లభించింది. తమ కుమారుడు సతీష్ కనిపించడం లేదంటూ ఇటీవలే అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సతీష్ కోసం గాలించారు. దీనితో అతడు కడపలో వున్నట్లు కనుగొన్నారు.
 
కాగా తల్లిదండ్రులు అతడిని మందలించడం వల్ల ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ నెల 18న ఇంటి నుంచి వెళ్లిపోయిన సతీష్ నేరుగా కడప ఎందుకు వెళ్లాడన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. సతీష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విజయవాడకు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేస్ట్-టు-వెల్త్ సామర్థ్యాన్ని వినియోగించే దిశలో కీలకమైన అడుగు