Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన భార్య మరొకరితో సహజీవనం చేస్తుందనీ...

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (08:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా వీరాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ కసాయి భర్త కడతేర్చాడు. మరొకరితో సహజీవనం చేస్తుందని భావించిన ఈ దారుణానికి పాల్పడ్డాడు. అదీకూడా మృతురాలు బతుకమ్మ ఆడుతున్న సమయంలోనే దారుణంగా హత్య చేశాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. 
 
పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన మామిడి ఎల్లమ్మ, గోపాల్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలుండగా పెద్ద కూతురు మంగను స్థానికుడైన యాళ్ల ఎల్లారెడ్డికి ఇచ్చి పెళ్లిచేశారు. నెల రోజులకే మంగ ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని చనిపోవడంతో మరలా రెండో కుమార్తె స్వప్నను ఇచ్చి వివాహం చేశారు. 
 
వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆరేళ్ల వరకు వీరి కాపురం సజావుగా జరిగింది. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు మొదలయ్యాయి. స్వప్న ఇదే గ్రామానికి చెందిన రమేశ్‌ అనే వ్యక్తితో 14 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. దీంతో ఎల్లారెడ్డి పలుమార్లు ఆమెతో గొడవకు దిగి చంపేస్తానని బెదిరించాడు.
 
ఈ క్రమంలో ఆదివారం రాత్రి తోటి మహిళలతో బతుకమ్మ ఆడుతుండగా.. ఆమె తలపై ఎల్లారెడ్డి ఇనుప రాడ్‌తో బలంగా మోదడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్‌ఐ తిరుపతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments