Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుష్ట సమాజంలో ఉండొద్దన్నాడు.. నా తండ్రి శివుడి వద్దే ఉన్నాడు...

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (08:31 IST)
ఈ దుష్ట సమాజంలో ఉండొద్దని శివుడు చెప్పాడని, పైగా, తన తండ్రి కూడా శివుడి వద్దే ఉన్నాడని అందుకే తాను కూడా అక్కడికే వెళుతున్నట్టు చెప్పి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చాట్లమడ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన వెంకట పూర్ణ శేఖర్ రెడ్డి అనే యువకుడు చెన్నైలో ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. చిన్నపుడే తండ్రి చనిపోవడంతో తల్లి, చెల్లితో కలిసి ఉంటూ, వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి చెన్నై సొంతూరికి వచ్చేసిన పూర్ణశేఖర్ ఇంట్లో చీరతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ దుష్ట సమాజంలో ఉండొద్దని శివుడు చెప్పాడని, అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నట్టు సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. తన తండ్రి కూడా శివుడు వద్దే ఉన్నాడనీ, తాను కూడా ఆయన వద్దకే వెళ్లిపోతున్నానని తెలిపారు.
 
తన సోదరికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, ఆస్తులన్నీ ఆమె పేరుమీద రాయాలని బంధువులకు సూచించాడు. అయితే, పూర్ణ శేఖర్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్న అంశాలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. శివుడు పిలుస్తున్నాడంటూ ఉరేసుకున్నాడా? లేదా ప్రేమ వ్యవహారమా? అనేది తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments