బంగ్లాదేశ్‌లో పడవ మునక .. 23 మంది జలసమాధి

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (21:23 IST)
బంగ్లాదేశ్‌లో ఆదివారం ఘోరం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న పడవ ఒకటి నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది జల సమాధి అయ్యారు. మరికొంతమంది గల్లంతయ్యారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. అయితే, ఇప్పటి వరకు వెలికితీసిన మృతదేహాల్లో మహిళలు, పిల్లలు ఉన్నారని ఉత్తర పంచగఢ్‌ జిల్లా పాలనాధికారి జహరుల్‌ ఇస్లాం తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో దాదాపు 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 
 
ఇదిలావుంటే, బంగ్లాదేశ్‌లో ఇటీవలి కాలంలో పడవ ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య వందల్లో ఉంది. అయితే, ఈ దేశంలో నడుపుతున్న పడవ యజమానులు సరైన భద్రతా చర్యలు పాటించక పోవడం వల్లే ఇవి జరుగుతున్నట్టు సమాచారం. కాగా, గత మే నెలలో కూడా పద్మ నదిలో స్పీడ్‌బోట్‌ ఇసుక లోడ్‌తో ఉన్న బల్క్‌ క్యారియర్‌ను ఢీకొట్టిన ఘటనలో 26 మంది మృతి చెందిన విషయం తెల్సిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం