Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యంమత్తులో భార్యను కొట్టి చంపిన భర్త

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (16:13 IST)
సిద్ధిపేట జిల్లాలో దారుణం జరింది. మద్యం మత్తులో ఓ తాగుబోతు కట్టుకున్న భార్యను హతమార్చాడు. అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశాడు. ఈ దారుణం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతులుతండా గ్రామపంచాయతీ పరిధిలోని తారాచంద్‌ తండాలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పంతులు తండాగు చెందిన జాటోతు మణెమ్మ(40)ను భర్త స్వామి అనుమానిస్తూ తరచూ గొడవలు పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పలుమార్లు గ్రామ పెద్దలు పంచాయతీ చేసి సర్ది చెప్పారు. అయితే, బుధవారం సమ్మక్క సారక్క పండుగ చేసుకున్న తర్వాత రాత్రి ఆస్తిలో సగం మొదటి భార్య కుమార్తెకు రాసిస్తానని అనడంతో భార్య భర్తల మధ్య గొడవ ప్రారంభమైంది. 
 
తాగిన మైకంలో ఉన్న స్వామి భార్యను కర్రతో తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం భార్య మృతదేహాన్ని భర్త స్వామి ట్రాక్టర్‌లో అక్కన్నపేట మండల కేంద్రానికి తీసుకువచ్చి పెట్రోల్‌ బంక్‌, ప్రభుత్వ ఆసుపత్రి మధ్యన రోడ్డు పక్కన పడేసి వెళ్లాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments