మేడారం జాతరలో ముఖ్యమంత్రి కేసీఆర్

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (15:46 IST)
తెలంగాణ గడ్డపై జరుగుతున్న ఆసియాలోనే అతిపెద్ద జాతరగా చెప్పుకునే మెడారం జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా మేడారంకు చేరుకున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని తిరిగి సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. 
 
ఇదిలావుంటే, మేడారం మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క తల్లి గురువారం రాత్రి 9.19 గంటలకు గద్దెపైకి చేరింది. తల్లి రాక వేళ మేడారం శిగమూగింది. కోళ్లు, మేకలు తలలు తెంచుకొని రక్తతర్పణం చేశాయి. 
 
సమ్మక్క, సారలమ్మలు కొలువుదీరడంతో నిండుపున్నమి, పండు వెన్నెల మధ్య జాతర పరిపూర్ణంగా మారింది. వనదేవతల కొలువుతో గద్దెలు వేయి వెలుగుల కాంతితో తళుకులీనుతున్నాయి. భక్తులపై తల్లులు వర్షిస్తున్న ఆశీస్సులతో గద్దెలు దివ్యక్షేత్రంగా భాసిల్లుతున్నాయి. 
 
మేడారం ఆధ్యాత్మిక శిఖరంగా వెలుగొందుతోంది. వేయికళ్లుకూడా చాలవన్న చందగా సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. సమ్మక్క రాకతో యావత్‌ మేడారం శిగాలూగింది. మహాజాతర పతాకస్థాయికి చేరుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: తాజా న్యూస్... నందమూరి బాలక్రిష్ణ, మలినేని గోపీచంద్ సినిమా కథ మారిందా ?

మరోమారు ఆపన్న హస్తం అందించేందుకు సిద్ధమైన సోనూసూద్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments