Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సొంత జిల్లాలో విద్యార్థి అనుమానాస్పద మృతి

Webdunia
ఆదివారం, 2 జులై 2023 (09:42 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థి అనుమానాస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కలిసి మృతదేహంతో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఇది ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 
 
మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పులివెందుల అహోబిలాపురం వీధికి చెందిన నాగరాజు, లలిత దంపతుల కుమారుడు సోహిత్(11) ఖాజీపేట మండలం కొత్త పేటలోని బీరు శ్రీధర్రెడ్డి పాఠశాలలో 6వ తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం ఉదయం పాఠశాల సిబ్బంది నాగరాజుకు ఫోన్‌చేసి సోహిత్ కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడని, దీంతో బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బాలుడి శరీరంపై గాయాలు గుర్తించి మృతదేహాన్ని పాఠశాల వద్దకు తీసుకెళ్లగా, సిబ్బంది గేటు వేసేయడంతో బయటే బైఠాయించారు. 
 
సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదంటూ బంధువులు పాఠశాల కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించిన రూరల్ సీఐ నరేంద్ర రెడ్డి ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. ఎట్టకేలకు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు బంధువులను ఒప్పించి కడప రిమ్స్‌కు తరలించారు. కాగా.. విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో బీరంరెడ్డి శ్రీధర్రెడ్డి పాఠశాలను తక్షణమే మూసివేయాలని డీఈవో రాఘవరెడ్డి ఆదేశాలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments