Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సొంత జిల్లాలో విద్యార్థి అనుమానాస్పద మృతి

Webdunia
ఆదివారం, 2 జులై 2023 (09:42 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థి అనుమానాస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కలిసి మృతదేహంతో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఇది ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 
 
మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పులివెందుల అహోబిలాపురం వీధికి చెందిన నాగరాజు, లలిత దంపతుల కుమారుడు సోహిత్(11) ఖాజీపేట మండలం కొత్త పేటలోని బీరు శ్రీధర్రెడ్డి పాఠశాలలో 6వ తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం ఉదయం పాఠశాల సిబ్బంది నాగరాజుకు ఫోన్‌చేసి సోహిత్ కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడని, దీంతో బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బాలుడి శరీరంపై గాయాలు గుర్తించి మృతదేహాన్ని పాఠశాల వద్దకు తీసుకెళ్లగా, సిబ్బంది గేటు వేసేయడంతో బయటే బైఠాయించారు. 
 
సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదంటూ బంధువులు పాఠశాల కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించిన రూరల్ సీఐ నరేంద్ర రెడ్డి ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. ఎట్టకేలకు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు బంధువులను ఒప్పించి కడప రిమ్స్‌కు తరలించారు. కాగా.. విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో బీరంరెడ్డి శ్రీధర్రెడ్డి పాఠశాలను తక్షణమే మూసివేయాలని డీఈవో రాఘవరెడ్డి ఆదేశాలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments