Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ ఆర్డర్ బాక్సు తెరవగానే పేలిపోయింది, ఇద్దరు మృతి

ఐవీఆర్
గురువారం, 2 మే 2024 (16:14 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సబర్‌కాంతలోని వడాలిలో ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా వచ్చిన ఓ పార్శిల్‌ తెరవగానే పేలుడు సంభవించిన ఘటన వెలుగు చూసింది. వడాలిలోని ఓ కుటుంబం ఎలక్ట్రానిక్ వస్తువుల పార్శిల్ ఆర్డర్ చేసింది. పార్శిల్‌ను తెరవగానే భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 ఏళ్ల బాలిక, 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. ఇద్దరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
 
ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ పార్శిల్ వంజర జితేంద్రభాయ్ పేరు మీద వచ్చింది. ఇంటికి చేరుకోగానే కుటుంబ సభ్యులు పార్శిల్ తెరిచారు. ఆపై ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల పార్శిల్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై గ్రామస్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
 
ఒక రిక్షా పుల్లర్ వచ్చి ఇదిగో మీ పార్శిల్ ఎవరో నాకు ఇస్తే మీకు ఇస్తున్నానని చెప్పాడు. అనంతరం పార్శిల్‌ను తెరుస్తుండగా పేలుడు సంభవించింది. ఇందులో మంజూర్ హుస్సేన్ పిర్జాదా, 11 ఏళ్ల బాలిక చనిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పార్శిల్‌లో ఎలాంటి పేలుడు పదార్థాలున్నాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments