గంజాయి మత్తులో ఐదుగురిని హత్య చేసిన కిరాతకుడు.. ఆ తర్వాత...

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (14:42 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ వ్యక్తి కుటుంబంలోని ఐదుగురిని హత్య చేశాడు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ దారుణానికి పాల్పడిన కిరాతకుడు చేసిన తప్పును తెలుసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని సెంగంలో పళనిస్వామి (45) అనే రైతు గత కొంతకాలంగా ఆర్థికపరమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈయనకు గంజాయి సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన భార్యా బిడ్డలను దారుణంగా గొడ్డలతో నరికి చంపేశాడు. మృతుల్లో భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. వీరిని త్రిష (15), మోనిష (14), శివశక్తి (6), భూమిక (9 నెలలు)గా గుర్తించారు. 
 
అయితే, మహిళ కొనఊపిరితో ఉండటాన్ని స్థానికులు గుర్తించి తిరువణ్ణామలై ఆస్పత్రికి తరలించగా, ఆమె కూడా మరణించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో తాను చేసిన తప్పును తెలుసుకున్న పళని తన పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments