Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి మత్తులో ఐదుగురిని హత్య చేసిన కిరాతకుడు.. ఆ తర్వాత...

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (14:42 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ వ్యక్తి కుటుంబంలోని ఐదుగురిని హత్య చేశాడు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ దారుణానికి పాల్పడిన కిరాతకుడు చేసిన తప్పును తెలుసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని సెంగంలో పళనిస్వామి (45) అనే రైతు గత కొంతకాలంగా ఆర్థికపరమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈయనకు గంజాయి సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన భార్యా బిడ్డలను దారుణంగా గొడ్డలతో నరికి చంపేశాడు. మృతుల్లో భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. వీరిని త్రిష (15), మోనిష (14), శివశక్తి (6), భూమిక (9 నెలలు)గా గుర్తించారు. 
 
అయితే, మహిళ కొనఊపిరితో ఉండటాన్ని స్థానికులు గుర్తించి తిరువణ్ణామలై ఆస్పత్రికి తరలించగా, ఆమె కూడా మరణించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో తాను చేసిన తప్పును తెలుసుకున్న పళని తన పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments