Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త..

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (09:10 IST)
తన భార్యకు ఫోను ద్వారా పొద్దస్తమానం మెసేజ్‌లు పంపుతున్న ఓ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కట్టుకున్న భర్త.. చివరకు ఆ యువకుడి కుడిచేతిని నరికేశాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవద్దని, ఫోను సందేశాలు పంపొద్దంటూ పలుమార్లు హెచ్చరించినా ఆ యువకుడు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో విచక్షణ కోల్పోయిన భర్త.. ఆ యువకుడిపై కత్తితో దాడి చేసి చేతి వేలిని నరికేసాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏలూరు జిల్లా నిడమర్రు మండలం బావాయిపాలెంకు చెందిన మజ్జి ఏసురాజు (26) అనే యువకుడు ఇటీవల హత్యకు గురయ్యాడు. ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఏసురాజును ఆమె భర్త పలుమార్లు హెచ్చరించారు. కానీ, ఏసురాజు మాత్రం ఆ హెచ్చరికలను బేఖాతరు చేశాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఉండి మండలంలోని అత్తింట్లో తన భార్య ఏసురాజు ఉండటాన్ని గమనించిన భర్త.. తట్టుకోలేకపోయాడు. 
 
వెంటనే తన తండ్రి, మరో వ్యక్తికి ఫోన్ చేసి వారిని అక్కడికి రప్పించారు. అందరూ కలిసి ఏసురాజును పట్టుకుని బావాయిపాలెం తీసుకెళ్లారు. అక్కడ ఏసురాజుపై దాడి చేశారు. తన భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడంటా ఏసురాజు కుడిచేతిని సగానికిపైగా నరికి దూరంగా పడేశాడు. ఆ తర్వాత ఏసురాజును కాపవరం పంట కాలువ రేవులో పడేసి అక్కడ నుంచి ముగ్గురు పారిపోయారు. కుడి చేతిని నరికివేయడంతో తీవ్ర రక్తస్రావమనైన ఏసురాజును ఎవరూ గమనించకపోవడంతో అపస్మారకస్థితిలోకి జారుకుని ప్రాణాలు విడిచాడు. ఈ కేసులో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments