Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన విషయాల్లో జోక్యం చేసుకుంటుందనీ మేనత్తను చంపి ముక్కలు చేశాడు..

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (09:33 IST)
తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటుందన్న కోపంతో ఓ యువకుతు తన మేనత్తను చంపి మృతదేహాన్ని పది ముక్కలు చేశాడు. ఒక్కో ముక్కను ఒక్కో ప్రాంతంలో పడేశాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. అయితే, మేనత్త మృతదేహాన్ని ముక్కలు చేసే సమయంలో కిందపడిన రక్తాన్ని శుభ్రం చేస్తుండగా మృతురాలి కుమార్తె చూడటంతో ఈ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 
 
జైపూర్‌కు చెందిన సరోజ్ శర్మ (64) అనే మహి భర్త చనిపోయాడు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. భర్త చనిపోయినప్పటి నుంచి ఈమె బాగోగులను అనుజ్ శర్మ అనే వ్యక్తి చూస్తున్నాడు. సరోజ్ శర్మ ఈయనకు మేనత్తవరుస అవుతుంది. అయితే, అనుజ్ శర్మ వ్యక్తిగత విషయాల్లో మేనత్త జోక్యం చేసుకునేది. ఈ జోక్యం మితిమీరిపోవడంతో అనుజ్ శర్మ భరించలేకపోయాడు. ఈ నెల 11వ తేదీన అనుజ్ ఢిల్లీ వెళ్ళాల్సి ఉండగా, అందుకు ఆమె సమ్మతించలేదు. 
 
దీంతో కోపోద్రిక్తుడైన అనుజ్.. మేనత్తను సుత్తితో కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని మార్పుల్ కటింగ్ యంత్రంతో 10 ముక్కలు చేశాడు. వాటిని అడవిలో వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. పైగా, తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా మేనత్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో అనుజ్ కిచెన్‌లో రక్తపు మరకలను నీటితో శుభ్రం చేస్తూ సరోజ్ కుమార్తె కంటపడ్డాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments