Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలుకెళ్లిన బాలుడుని లాడ్జీకి లాక్కెళ్లి యువతి అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (08:17 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. స్కూలుకెళ్లిన బాలుడిని ఓ యువతి బలవంతంగా లాడ్జీకి తీసుకెళ్లిన ఓ యువతి అత్యాచారానికి పాల్పడింది. ఆ తర్వాత మూడుసార్లు బెదిరించి అతని వద్ద నుంచి ఏకంగా రూ.16 లక్షల వరకు వసూలు చేసింది. ఈ ఘటన మూడేళ్ల క్రితం జరిగినట్టుగా భావిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని టోలీచౌకీలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. ఇటీవల జూబ్లీహిల్స్‌కు మారింది. ఈ క్రమంలో బీరువాలో ఉండాల్సిన రూ.20 వేల నగదుతో పాటు బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో 9వ తరగతి చదువుకుంటున్న తన కుమారుడిని తల్లి నిలదీయగా, అతను చెప్పిన విషయం విని ఆ తల్లి నిర్ఘాంతపోయింది. 
 
డబ్బుతో పాటు.. బంగారాన్ని బెంగుళూరులో ఉండ్రి తండ్రి బంధువైన యువతికి ఇచ్చినట్టు చెప్పాడు. ఆ తర్వాత అస్సలు ఎందుకు ఇలా చేశావని నిలదీయడంతో అసలు విషయాన్ని పూసగుచ్చినట్టు వివవరించారు. 
 
ఒక రోజున తాను చదువుకుంటున్న స్కూలుకు వచ్చిన తనను బలవంతంగా లాడ్జీకి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేసిందని బోరున విలపిస్తూ చెప్పింది. పైగా, ఆ అఘాయిత్యాన్ని వీడియో తీసిపెట్టుకుని, దాన్ని చూపిస్తూ పలుమార్లు డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడున్నట్టు చెప్పింది. ఆ విధంగా మూడుసార్లు చేసిందని చెప్పింది. 
 
దీంతో తాను భయపడి మరో మార్గంలేక ఇంట్లోని బంగారం, డబ్బులను చోరీ చేసినట్టు చెప్పారు. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టగా, ఈ ఘటన మూడేళ్ళ క్రితం జరిగినట్టు నిర్థారించి, ఆ యువతిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments