Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగ బాలికను ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి అఘాయిత్యం.. ఆ తర్వాత..

ఠాగూర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (13:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలంలో ఓ దారుణం జరిగింది. దివ్యాంగ బాలికను ఓ కామాంధుడు ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. 
 
కదిరి డీఎస్పీ శ్రీలత తెలిపిన మేరకు.. స్థానిక సారగుండ్లపల్లికి చెందిన నాగార్జున (32) వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ వలంటీరుగా పనిచేశాడు. రెండేళ్ల క్రితం అతనికీ వివాహమైంది. ఆదివారం తన భార్యను పుట్టింట్లో వదిలిపెట్టేందుకు వెళ్లిన నాగార్జున అదేరోజు రాత్రి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో అదే మార్గంలోని ఓ ఊరిలో దివ్యాంగ బాలిక, మరికొందరు చిన్నారులు కలిసి ఆడుకుంటూ కనిపించారు.
 
దీంతో నాగార్జున.. దివ్యాంగ బాలికను ముళ్ల పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఇది చూసిన చిన్నారులు కేకలు వేయడంతో గ్రామస్థులతో పాటు బాలిక తండ్రి అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా స్వగ్రామానికి పారిపోయాడు. అక్కడ నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రాసుకున్న సూసైడ్ నోట్ రాసి పెట్టగా, దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments