Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య, నవజాత శిశువును కాపాడాలి.. మూడేళ్ల కుమారుడిని అమ్మేశాడు..

సెల్వి
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (13:12 IST)
భార్యతో పాటు నవజాత శిశువును కాపాడేందుకు ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఒక వ్యక్తి తన భార్య, నవజాత శిశువును ప్రైవేట్ ఆసుపత్రి నుండి రక్షించడానికి తన మూడేళ్ల కొడుకును బలవంతంగా విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లోని బర్వా పట్టిలో చోటుచేసుకుంది. 
 
ఈ ఘటన గురించి తెలుసుకున్న అధికారులు సత్వరమే స్పందించి చిన్నారిని తీసుకెళ్లిన దంపతులతో సహా ఐదుగురిని శనివారం అరెస్టు చేశారు. 
 
వివరాల్లోకి వెళికే.. బార్వా పట్టి నివాసి హరీష్ పటేల్ అనే వ్యక్తి రోజువారీ కూలీగా పని చేస్తూ తన భార్య ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లాడు. అయితే వెంటనే ఆస్పత్రికి కట్టాల్సిన మొత్తం కట్టలేక తల్లీ, బిడ్డను వారు బయటకు పంపలేదు. ఇది పటేల్‌కు ఆరవ సంతానం. దీంతో ఇక చేసేద లేక నిరాశతో, తన మూడేళ్ల కొడుకును శుక్రవారం కొన్ని వేల రూపాయలకు విక్రయించడానికి తండ్రి అంగీకరించాడు.
 
అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఆ చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments