Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేనల్లుడు లైంగికంగా వేధిస్తున్నాడన్న మహిళ... శిరోమండనం చేసి చావబాదిన భర్త!!

victim girl

ఠాగూర్

, శనివారం, 7 సెప్టెంబరు 2024 (11:50 IST)
మేనల్లుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ కట్టుకున్న భర్తకు ఓ భార్య చెప్పింది. తన మేనల్లుడి గురించి భార్య ఇలా చెప్పడాన్ని జీర్ణించుకోలేని భర్త.. ఆమెను చావబాదాడు. శిరోమండనం చేశాడు. తాను మాత్రమే కాకుండా, తన కుటుంబీకులతో కూడా కొట్టించాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి చేరడంతో రంగ ప్రవేశం చేసి ఈ దారుణానికి పాల్పడిన భర్తతో సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్‌లో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తనను మేనల్లుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ భార్యకు చెప్పింది. దీంతో ఆమెపై విచక్షణ రహితంగా దాడిచేసి శిరోముండనం చేశారు. ఈ నెల 3న ఈ ఘటన జరిగినప్పటికీ వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళకు గుండు గీసి, కాళ్లుచేతులు కట్టేయడం వీడియోలో కనిపించింది. గుమికూడిన జనం ముందే భర్త ఆమెను కర్రతో చావబాదాడు. బాధతో విలవిల్లాడుతున్న ఆమెపై నిందితులు వంతుల వారీగా దాడిచేశారు.
 
మేనల్లుడు రాజనాథ కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత మహిళ ఆరోపించింది. ఈ విషయం చెప్పినందుకు భర్త, ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోతూ శిరోముండనం చేయించి కర్రలతో చావగొట్టారు. వీడియో పోలీసులకు చేరడంతో వారు వెంటనే స్పందించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు 70 యేళ్లు - 70 అడుగులతో విఘ్నేశ్వరుడు