Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంలో కారులో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం - మరో నిర్భయ ఘటన

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (15:14 IST)
ఈశాన్య భారత రాష్ట్రమైన త్రిపురలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. కాలేజీకి వెళ్లి ఇంటికి వెళుతున్న 20 యేళ్ళ కాలేజీ విద్యార్థినిపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కారులో ఊరంతా తిప్పుతూ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆ తర్వాత బాధితురాలిని ఓ నిర్జన ప్రదేశంలో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్టు భావిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. త్రిపురకు చెందిన ఓ యువతి సోమవారం కాలేజీ ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆ యువతిని ముగ్గురు నిందితులు బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్‌కు పాల్పడిన ప్రధాన నిందితుడు ఆ యువతికి ఐదు నెలలుగా తెలుసు. యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించిన తర్వాత ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు పట్టణంలో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత ఓ ప్రదేశంలో వదిలి వెళ్లారు. ఆమెను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించి, ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలు జీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడైన కారు డ్రైవర్ గౌతమ్ శర్మ (26), సహ నిందితులు సుదీప్ ఛెత్రి (31), పెద్దజిత్ పాల్ (26)లుగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరి నుంచి రూ.90 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments