Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంలో కారులో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం - మరో నిర్భయ ఘటన

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (15:14 IST)
ఈశాన్య భారత రాష్ట్రమైన త్రిపురలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. కాలేజీకి వెళ్లి ఇంటికి వెళుతున్న 20 యేళ్ళ కాలేజీ విద్యార్థినిపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కారులో ఊరంతా తిప్పుతూ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆ తర్వాత బాధితురాలిని ఓ నిర్జన ప్రదేశంలో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్టు భావిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. త్రిపురకు చెందిన ఓ యువతి సోమవారం కాలేజీ ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆ యువతిని ముగ్గురు నిందితులు బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్‌కు పాల్పడిన ప్రధాన నిందితుడు ఆ యువతికి ఐదు నెలలుగా తెలుసు. యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించిన తర్వాత ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు పట్టణంలో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత ఓ ప్రదేశంలో వదిలి వెళ్లారు. ఆమెను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించి, ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలు జీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడైన కారు డ్రైవర్ గౌతమ్ శర్మ (26), సహ నిందితులు సుదీప్ ఛెత్రి (31), పెద్దజిత్ పాల్ (26)లుగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరి నుంచి రూ.90 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments