సీబీఎస్ఈ పరీక్షా ఫలితాలు వెల్లడి - ఎలా తెలుసుకోవాలంటే...

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (14:53 IST)
పదో తరగతి, 12వ తరగతి పరీక్షా ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం వెల్లడించింది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులందరికీ మార్కు షీట్‌లు, ఉత్తీర్ణ ధృవీకరణ పత్రాలు డిజి లాకర్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన వారు తమ సీబీఎస్ఈ ఫలితాల డిజిలాకర్ ఖాతాలను యాక్టివేట్ చేయడం ద్వారా ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. తొలుత 12వ తరగతి పరీక్షా ఫలితాలను వెల్లడించిన సీబీఎస్ఈ అధికారులు ఆ తర్వాత పదో తరగతి పరీక్షా ఫలితాలను రిలీజ్ చేశారు. 
 
విద్యార్థులు, తల్లిదండ్రులు తమ డిజిలాకరు ఖాతాలను యాక్టివేట్ చేయడానికి ఆరు అంకెల సెక్యూరిటీ పిన్ అవసరమవుతుంది. డిజి లాకర్‌తో పాటు పరీక్షా సంగమ్ నుంచి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంర్లు, స్కూల్ నంబర్లతో ఈ పరీక్షా ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు ఎవరైనా తమ డిజిలాకర్ సెక్యూరిటీ పిన్‌ను పొందినట్టయితే ఇందుకోసం వారు తమ పాఠశాలలను సంప్రదించవలసి ఉంటుంది. 12వ తరగతిలో ఉత్తీర్ణత 87.33 శాతం కాగా, పదో తరగతిలో 93.12 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments