Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాదులో దారుణం: పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు గ్యాంగ్ రేప్, వీడియో తీసి...

Advertiesment
Hyderabad Crime
, మంగళవారం, 29 నవంబరు 2022 (21:28 IST)
పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఐదుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాలూకు వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసారు. హైదరాబాదు లోని హయత్ నగర్ శివారు ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. 
 
ఆగస్టులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు, ఆ దారుణాన్ని వీడియో తీసారు. ఎవరికైనా చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తూ మరో పది రోజుల తర్వాత అఘాయిత్యం చేసారు.
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిందితులు షేర్ చేసారు. విషయం బాధితురాలి తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా మైనర్లు కావడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది తెలియాల్సి వుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిరిండియాలో విస్తారా విలీనం..