బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

ఠాగూర్
సోమవారం, 7 ఏప్రియల్ 2025 (10:58 IST)
ఓ బ్యాడ్మింటన్ కోచ్ తన వద్దకు వచ్చిన బాలికలకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం చేసిన ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలో వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న ఓ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుళిమావు పోలీసులు కేసు నమోదుచేసి కోచ్ సురేశ్ బాలాజీని అరెస్టు చేశారు. 
 
పోలీసుల కథనంమేరకు.. తమిళనాడు రాష్ట్రానికి సురేశ్ బాలాజీ ఓ బ్యాడ్మింటన్ కోచ్‌గా అనేక మంది బాలికలు శిక్షణ ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఓ బాలిక గత రెండేళ్లుగా అతని వద్దకు శిక్షణకు వెళుతోంది. ఆ బాలికకు మాయమాటలు చెప్పిన కోచ్.. ఆపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతూ నగ్న ఫోటోలు వీడియోలు తీసేవాడు. 
 
అయితే, ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఆ బాలిక తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అక్కడి నుంచి కూడా తనకు నగ్నఫోటోలు పంపాలని బాలికపై కోచ్ ఒత్తిడి చేశాడు. దీంతో అమ్మమ్మ మొబైల్ నుంచి తన న్యూడ్ ఫోటోలను కోచ్‌కు పంపించింది. తన మొబైల్ ఫోనులో బాలిక న్యూడ్ ఫోటోలు ఉండటాన్ని గమనించిన అమ్మమ్మ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.
 
పిమ్మట బాలిక వద్ద తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయాన్ని వెల్లడించింది. ప్రత్యేక శిక్షణ పేరుతో కోచ్ పలుమార్లు అపార్టుమెంట్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించాడని తెలిపింది. దీనిపై బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సురేశ్ బాలాజీని అరెస్టు చేశారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతని ఫోనును పరిశీలించగా, మొబైల్‌లో మరో ఎనిమిది మంది బాలికల న్యూడ్ ఫోటోలను పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments