పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

ఐవీఆర్
మంగళవారం, 21 అక్టోబరు 2025 (23:12 IST)
రాజమండ్రిలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను హాస్టల్ నుంచి బైటకు తీసుకెళ్లి అత్యాచారం చేసాడు. బాధితురాలు రాజమండ్రి టూటౌన్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
రాజమండ్రిలో వున్న ఓ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం హాస్టలులో వుండి చదువుకుంటున్న విద్యార్థిని సోమవారం నాడు సాయంత్రం తన అన్నయ్య వచ్చాడనీ, బైటకెళ్లి వస్తువులు కొనుక్కోవాలని వార్డెన్‌కి చెప్పి వెళ్లింది. ఐతే వచ్చిన యువకుడు బాలికను తన వాహనంపైన ఎక్కించుకుని గోదావరి గట్టుపైకి తీసుకెళ్లాడు.
 
అక్కడ మరో యువకుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమెను రాజమండ్రి రైల్వే స్టేషనులో వున్న ఓ లాడ్జికి తీసుకుని వెళ్లాడు. ఆ లాడ్జి గదిలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలిని దేవిచౌక్ లో దింపేసి వెళ్లిపోయాడు. నిందితుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకి చెందిన అజయ్ గా పోలీసులు గుర్తించారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments