Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లకు గంతలు కట్టి పెళ్లాడబోయే వాడి పీక కోసింది, ఏమైంది?

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (23:08 IST)
మరో నెలరోజుల్లోనే పెళ్లి. ధూంధాంగా వస్తువులు, నగలు కొంటున్నారు. కాబోయే జంట తమకు ఇష్టమైన దుస్తులు కొనేందుకు వచ్చారు. షాపింగ్ ముగిసింది. ఇంటికి తిరుగుముఖం పట్టారు. మధ్యలో తను కట్టుకోబోయే భర్త పీక కోసి పరారైంది ఓ యువతి. ఏం జరిగింది?

 
ఏపీలోని అనకాపల్లి బుచ్చయ్యపల్లి పరిధిలోని కొమళ్లపూడిలో ఓ దారుణం చోటుచేసుకుంది. మాడుగుల మండలానికి చెందిన రామునాయుడికి, రావికమతం గ్రామానికి చెందిన పుష్పకి పెద్దలు వివాహ నిశ్చయం చేసారు. పెళ్లి వచ్చే నెల 20వ తేదీ జరగాల్సి వుంది. ఈ క్రమంలో కాబోయే భార్యాభర్తలు షాపింగ్ చేసేందుకు వడ్డాది వెళ్లారు. ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

 
దారిమధ్యలో సాయిబాబా గుడి వుండటంతో అక్కడ కొద్దిసేపు విరామం తీసుకుని వెళ్దామని యువతి చెప్పింది. దానితో రామునాయుడు ఆ గుడివద్దకు ఆమెతో కలిసి వెళ్లాడు. ఇంతలో సరదాగా ఓ ఆట ఆడదామంటూ అతడి కళ్లకు గంతలు కట్టింది. అలా ఆడుతూనే తనతో తెచ్చుకున్న కత్తితో కాబోయే వాడి పీక కోసింది.

 
ఆ తర్వాత తనే బాధితుడ్ని తన ద్విచక్రవాహనంపై తీసుకుని వచ్చి సమీప ఆసుపత్రిలో చేర్పించి గొంతుకు ఏదో గుచ్చుకున్నదని చెప్పి అక్కడి నుంచి పరారైంది. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చోసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments