Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కుంభమేళా వెళ్తున్న కామాంధుడు

ఐవీఆర్
గురువారం, 20 ఫిబ్రవరి 2025 (19:35 IST)
ఆ కామాంధుడికి బాలికలే టార్గెట్. అభంశుభం తెలియని చిన్నారుల బతుకులను ఛిద్రం చేయడమే కాకుండా సాక్ష్యాధారాలు దొరక్కుండా తక్కువ శిక్షలతో బయటపడుతుంటాడు. ఈ మృగాడి పేరు రమేష్ సింగ్. 2003లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో 10 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఐనా బుద్ధి మారలేదు. 2014లో బయటకు వచ్చీ రాగానే ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి చేసాడు.
 
ఈ నేరానికి కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. కానీ సాంకేతిక ఆధారాలు లభించకపోవడంతో హైకోర్టు అతడి ఉరిశిక్షను రద్దు చేసింది. దీనితో జైలు నుంచి బయటకు వచ్చాడు. కానీ అతడిలో కామాంధుడు మాత్రం చావలేదు. ఫిబ్రవరి 7న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజగఢ్ జిల్లాకి చెందిన 11 ఏళ్ల మూగచెవిటి బాలికపై అఘాయిత్యం చేసి హత్య చేసాడు. ఫిబ్రవరి 1న బాలిక కనిపించకపోవడంతో చుట్టుపక్కల అంతా వెతికారు.
 
చివరికి సమీపంలోని దట్టమైన చెట్ల మధ్య శవమై కనిపించింది. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు తేలడంతో పోలీసులు చుట్టుపక్కల సీసీ కెమేరాలు పరిశీలించారు. దాంతో మరోసారి రమేష్ సింగ్ కంటబడ్డాడు. ఇన్ని పాపాలు చేసిన అతడు కుంభమేళా పుణ్యస్నానాలకు వెళ్తూ వుండటంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈసారి ఆధారాలు సేకరించి నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం