Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఆటతీరుపై సానియా సెటైర్లు (video)

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (14:38 IST)
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా పాకిస్థాన్ జట్టు తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు కేవలం 105 పరుగులకే చేతులెత్తేశారు. ఆ తర్వాత మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 348 పరుగులు బాదారు. ఫలితంగా ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసింది. 
 
దీనిపై పాకిస్థాన్ కోడలు భారత టెన్నిస్ తార సానియా మీర్జా స్పందిస్తూ, 'పాకిస్థాన్ జట్టుకు శుభాభినందనలు. ఓ మ్యాచ్‌లో ఓటమిపాలైనా పుంజుకుని గెలుపు బాట పట్టడం అద్భుతం. పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఊహించలేమని అందరూ ఎందుకు అంటారో మరోసారి నిరూపితమైంది. క్రికెట్ ప్రపంచకప్ మరింత ఆసక్తికరంగా మారిందనడంలో ఎలాంటి సందేహంలేదు' అంటూ ట్వీట్ చేశారు. 
 
అయితే, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రదర్శించిన చెత్త ప్రదర్శనతో  పాకిస్థాన్ జట్టు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. పాక్ ఆటగాళ్లను అభిమానులు భయంకరంగా తిట్టిపోశారు. ఓవైపు మాజీలు, మరోవైపు కరుడుగట్టిన అభిమానులు పాక్ జట్టును ఉక్కిరిబిక్కిరి చేశారు.

ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టును ఓడించి పరువు నిలుపుకుంది. దాంతో ఎప్పట్లాగానే పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు శభాష్ అంటూ మెచ్చుకోళ్లతో హోరెత్తిస్తుండగా, టైటిల్ విజేత పాకిస్థానే అంటూ అభిమానులు ఊదరగొడుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments