Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్‌లో ఎవరిది పైచేయి : కోహ్లీ ఆ ఆనవాయితీని రిపీట్ చేసేనా?

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (13:24 IST)
వరల్డ్ కప్ పోటీల్లోభాగంగా బుధవారం భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. మరోవైపు, ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. దీంతో బుధవారం మధ్యాహ్నం జరిగే ఈ పోరు హోరాహోరీగా సాగనుంది. 
 
కాగా, ప్రపంచ కప్‌లో భారత్, సౌతాఫ్రికా జట్లు ఇప్పటివరకు నాలుగుసార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. వీటిలో మూడుసార్లు సఫారీలు విజయకేతనం ఎగురవేయగా, ఒకసారి మాత్రం భారత్ విజయం సాధించింది. ఈలెక్కల ప్రకారం చూస్తే భారత్‌పై సఫారీలతో పైచేయిగా ఉంది. 
 
మరోవైపు, సౌతాంప్ట‌న్‌లో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ సెంచ‌రీ చేస్తాడా అన్న‌దే ఇప్పుడు టాపిక్‌. వ‌ర‌ల్డ్‌క‌ప్ మొద‌టి మ్యాచ్‌లో కోహ్లీకి సెంచ‌రీ కొట్ట‌డం అల‌వాటే. 2011లో, ఆ త‌ర్వాత 2015లోనూ.. కోహ్లీ సెంచ‌రీల‌తో టోర్నీలకు కిక్ ఇచ్చాడు. 2011లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లోనే కోహ్లీ సెంచ‌రీ చేశాడు. 
 
2015 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ పాకిస్థాన్‌తో జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లో కోహ్లీ సెంచ‌రీ కొట్టాడు. మరి బుధవారం కూడా కోహ్లీ ఈ ఆనవాయితీని కొనసాగిస్తాడా లేదా అన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ రెండు సెంచ‌రీలు చేసిన ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయభేరీ మోగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments