Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్‌లో నేటి నుంచి టీమిండియా దండయాత్ర

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (09:42 IST)
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా భారత క్రికెట్ జట్టు తన తొలి మ్యాచ్‌ను బుధవారం ఆడనుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టుతో కోహ్లీ సేన తలపడనుంది. ఇందుకోసం సర్వసన్నద్ధంగా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు సౌథాంప్టన్ వేదికగా తలపడనుంది.
 
ఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య 4 మ్యాచ్‌లు జరగ్గా అందులో మూడింట్లో సఫారీలు విజయం సాధించగా భారత్ ఒకే మ్యాచ్‌లో గెలిచింది. విరాట్ కోహ్లీ, ధోనీ, ధవాన్, రోహిత్ ఇలా అందరూ కూడా ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అయితే వరుస రెండు మ్యాచ్‌లు ఓడిన సఫారీ జట్టుకు ఈ మ్యాచ్ చావోరేవో అనే చెప్పాలి. 
 
మరోవైపు, టీమిండియా అనగానే బ్లూ కలర్ యూనిఫాం అని ఎవరైనా చెప్పేస్తారు. అందుకే, భారత జట్టును మెన్‌ఇన్ బ్లూ అని కూడా పిలుస్తుంటారు. అయితే, తొలిసారిగా భారత క్రికెటర్లు మరో రంగు దుస్తుల్లో కనువిందు చేయనున్నారు. ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్‌లో ఎంపికచేసిన మ్యాచ్‌ల్లో ఆరెంజ్ కలర్ జెర్సీలు ధరించనున్నారు. 
 
అయితే ఆ మ్యాచ్‌లు ఏంటన్నవి తెలియరాలేదు. మొత్తమ్మీద టీమిండియాను ఎప్పుడూ ఒకే రంగులో చూస్తున్న అభిమానులకు ఇది కాస్త మార్పు అని చెప్పాలి. మరి కాషాయ దుస్తుల్లో కోహ్లీ సేన ఎలా కనిపిస్తుందో చూడాలి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

తర్వాతి కథనం
Show comments