Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్తను దుడ్డు కర్రతో కొట్టి చంపిన భార్య...

భర్తను దుడ్డు కర్రతో కొట్టి చంపిన భార్య...
, సోమవారం, 3 జూన్ 2019 (07:32 IST)
మూడు ముళ్ళు వేసినప్పటి నుంచి భర్త పెట్టే చిత్ర హింసలను భరించలేని ఆ మహిళ.. కాళికామాతలా మారిపోయింది. భర్త పెట్టే చిత్రహింసలను ఇక భరించలేనని భావించి.. దుడ్డుకర్రతో భర్తను చావబాదింది. దీంతో కట్టుకున్న భర్త చనిపోయాడు. 
 
చనిపోయిన వ్యక్తి ఓ నేవీ అధికారి కావడం గమనార్హం. ఈయన దక్షిణ గోవాలోని వాస్కో సబ్ జిల్లాలో ఉన్న నేవల్ బేస్‌లో ఐఎన్ఎస్ హన్స నౌకలో ఎయిర్‌క్రాఫ్ట్ విభాగంలో పని చేస్తున్నాడు. ఈయన పేరు కౌశలేంద్ర సింగ్. అతను తరచూ ఇంటికి తాగి వచ్చి భార్యను చితకబాదేవాడు. కొన్నేళ్ల పాటు కౌశలేంద్ర హింసను ఆమె భరించింది. 
 
శనివారం రాత్రి బాగా తాగి వచ్చిన కౌశలేంద్ర భార్యపై దాడి చేశాడు. దీంతో ఆమె ఇరుగు పొరుగు వారికి తన బాధను వెల్లడించింది. వారు వెళ్లగానే మరోమారు ఆమెపై కౌశలేంద్ర దాడికి తెగబడ్డాడు. ఇక సహించలేకపోయిన ఆమె అతను నిద్రలోకి జారుకోగానే దుడ్డుకర్రతో తలపై బలంగా మోదింది. 
 
గాయాలపాలైన కౌశలేంద్రను చూడగానే భయపడిపోయిన భార్య ఇరుగు పొరుగు సాయంతో నేవల్ ఆసుపత్రికి తరలించింది. అయితే అతడు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్థారించారు. పోలీసులకు సమాచారం చేరవేయగా కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్కసారిగా మారిన వాతావరణం.. చల్లబడిన తెలుగు రాష్ట్రాలు