Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంగ్లండ్‌కు పంచ్ పడింది.. ఆతిథ్య దేశాన్ని చిత్తు చేసిన పాకిస్థాన్

ఇంగ్లండ్‌కు పంచ్ పడింది.. ఆతిథ్య దేశాన్ని చిత్తు చేసిన పాకిస్థాన్
, మంగళవారం, 4 జూన్ 2019 (10:06 IST)
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య దేశమైన ఇంగ్లండ్‌కు పంచ్ పడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజృంభించి ఆడటంతో ఇంగ్లండ్ ఓటమిని చవిచూడాల్సివచ్చింది. 
 
నిజానికి పాకిస్థాన్ ఈ వరల్డ్ కప్ టోర్నీలో తన తొలి మ్యాచ్‌ను వెస్టిండీస్ జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. 150 పరుగులు కూడా చేయలేక చతికిలపడింది. దీంతో నలువైపులా విమర్శలు పాలైంది. 
 
ఈ ఘోర అవమాన ఓటమి నుంచి తేరుకోక ముందే ఆతిథ్య ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు అంచనాలకు భిన్నంగా ఆడారు. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు షాకింగ్ ఓటమిని చవిచూసింది. 
 
నాటింగ్ హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు టాస్ ఓడి బ్యాటింగ్‌ చేపట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. ఆ జట్టులో హఫీజ్ 84, అజామ్ 63, సర్ఫరాజ్ 55 చొప్పున పరుగులు చేయడంతో పాక్ జట్టు భారీ స్కోరు చేసింది. 
 
ఆ తర్వాత భారీ లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన ఇంగ్ండ్ జట్టు.... 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 334 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లండ్ ఆటగాళ్లళో రూట్ (107) - బట్లర్ (103)లు సెంచరీలతో కదం తొక్కినప్పటికీ జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేక పోయారు. ఫలితంగా వరల్డ్ ఫేవరేట్‌గా ఉన్న ఇంగ్లండ్‌కు పాకిస్థాన్ రూపంలో పంచ్ పడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌ చేతిలో టీమిండియా ఓడిపోతే.. (వీడియో)